
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
2020 పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్& లాక్ డౌన్ నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్తూ జూలై 10వ తేదీ నుంచి 15 వరకూ పరీక్షలు నిర్వహించనుంది. అలాగే ప్రతి పేపర్కు 100 మార్కులు ఉంటాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు సంబంధించి ఒక్కో పేపర్ మాత్రమే ఉంటుంది. రెండో పేపర్ ఉండదు విద్యార్థుల ఆరోగ్య రక్షణకు అన్నివిధాలా కట్టుదిట్టమైన చర్యలను తీసుకోబోతున్నట్టు వెల్లడించింది. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది
AP 10th classes PUBLIC EXAMS TIMETABLE DETAILS 👇
1.జూలై 10నఫస్ట్ లాంగ్వేజ్ (9.30am- 12.45pm)
2.జూలై11సెకండ్ లాంగ్వేజ్ (9.30am- 12.45pm)
3.జూలై 12ఇంగ్లీషు (9.30am- 12.45pm)
4.జూలై 13మ్యాథ్స్ (9.30am- 12.45pm)
5.జూలై14జనరల్ సైన్స్ (9.30am- 12.45pm)
6.జూలై 15 సోషల్ స్టడీస్ (9.30am- 12.45pm)