గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల కోసం జనవరిలో రెండవ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే… పరీక్షలు నిర్వహించే సమయంలో కరోనా వైరస్ ప్రభావం కారణంగాజరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. కాగా ఇటీవలే సెప్టెంబర్ 20నుంచి వారం రోజుల పాటు నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను విడుదల చేశారు. మొత్తం 14పరీక్షలకు సంబంధించి తేదీలను ప్రకటించారు. ఉదయం,మధ్యాహ్నం వేళల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి.
విభాగం వారీ పరీక్ష తేదీలు:
పంచాయత్ సెక్రెటరీ / మహిళా పోలీస్ / వార్డ్ అడ్మినిస్ట్రేటీవ్ సెక్రెటరీ / వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్- 2020 సెప్టెంబర్ 20 ఉదయం
పంచాయత్ సెక్రటరీ (గ్రేడ్ 6) డిజిటల్ అసిస్టెంట్- సెప్టెంబర్ 20, 2020 మధ్యాహ్నం
వీఆర్ఓ / విలేజ్ సర్వేయర్- సెప్టెంబర్ 21, 2020 ఉదయం
ఇంజనీరింగ్ అసిస్టెంట్ / వార్డు ఎమినిటీస్ సెక్రటరీ- సెప్టెంబర్21, 2020 మధ్యాహ్నం
వార్డు శానిటైజేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ- సెప్టెంబర్ 22, 2020 ఉదయం
వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 2- సెప్టెంబర్ 22, 2020 మధ్యాహ్నం
విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్- సెప్టెంబర్ 23, 2020 ఉదయం
వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ- సెప్టెంబర్ 23, 2020 మధ్యాహ్నం
వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రెటరీ- సెప్టెంబర్ 24, 2020ఉదయం
ఏఎన్ఎం/వార్డ్ హెల్త్ సెక్రటరీ (గ్రేడ్ 3)- సెప్టెంబర్ 24, 2020మధ్యాహ్నం
విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్- సెప్టెంబర్ 25, 2020 ఉదయం
విలేజ్ సెరీకల్చర్ అసిస్టెంట్- సెప్టెంబర్ 25, 2020 మధ్యాహ్నం
విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్- సెప్టెంబర్ 26, 2020 ఉదయం
విలేజ్ యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్- సెప్టెంబర్ 26, 2020మధ్యాహ్నం
మొత్తంగా 14 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను పైన సూచించిన విధంగా 🖕రూపొందించారు.గ్రామ సచివాలయాల్లో 14,062, వార్డు సచివాలయాల్లో 2,146పోస్టుల భర్తీకి ఈ ఏడాది జనవరిలో పంచాయతీరాజ్,పట్టణాభివృద్ధి శాఖలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. వీటికి సంబంధించి మొత్తం 11.06 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఆయా పోస్టుల భర్తీకిమొత్తంగా 14 రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.